Friday, April 26, 2024

రచయిత విజయేంద్రప్రసాద్ కి కరోనా..

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరిని వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా మరోసారి అందరిని భయపెడుతుంది. తాజాగా స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, తలైవితో పాటు హిందీలో పలు చిత్రాలకు రచయితగా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. తలైవి విడుదలకు రెడీ అవుతుండగా.. ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. 

ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement