Friday, April 19, 2024

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..

మేడిపల్లి: రజకులకు లాండ్రీలకు, దోభీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఆదేశించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని పోరుమల్ల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీపీ దొనకంటి ఉమాదేవి రాజా రత్నాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా, అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఏ-కై-క ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. అలాగే రాబోయే కాలంలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ తౌటి తిరుపతిరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మిట్టపెల్లి భూమరెడ్డి, మాజీ సర్పంచ్‌ వీరబత్తిని ఆంజనేయులు, జంబుక సాయికుమార్‌, అంబారిపేట వెంకటేష్‌, బోరగల్ల వెంకటేష్‌, కొలిపాక గంగరాజం, మునిగంటి ఎరన్న, అంబారిపట శ్రీను, రజక సంఘ సభ్యులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement