Friday, April 26, 2024

నేత్రదాత కుటుంబానికి అభినందనపత్రం..

ఓదెల: మండల కేంద్రంలో మార్క పరశరాములు ఇటీవల మృతిచెందగా ఆయన నేత్రాలను కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు దానం చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సదాశయ ఫౌండేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ భీష్మాచారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు వార్డు సభ్యులు అల్లం సంతోష్‌చే జ్ఞాపికను అందించారు. అనంతరం అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులకు వ్యవస్థాపక అధ్యక్షులు టి. శ్రవణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు త్రివేదిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రాజు, డాక్టర్‌ విష్ణు సంతోష్‌, సారంగంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement