Tuesday, May 7, 2024

ఫ్యామిలోకి వెల్ క‌మ్ వ‌దిన‌.. నిహారిక‌

ఈ రోజు కోసం ఎప్ప‌టి నుండో వేచి చూస్తున్నాను.. కుటుంబంలోకి స్వాగ‌తం వ‌దినా అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది న‌టి.. నిర్మాత నిహారిక‌. న‌టుడు నాగబాబు దంపతుల ఏకైక కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక అనంతరం వరుణ్ తేజ్ చెల్లెలు నీహారిక ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభినందనలు తెలియజేసింది. రోజు కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. కుటుంబంలోకి స్వాగతం వదినా’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసింది నీహారిక. తన పోస్ట్ తో పాటు నిశ్చితార్థ వేడుక ఫొటోను కూడా నీహారిక షేర్ చేసింది. అందులో అన్నయ్య, కాబోయే వదిన మధ్య నీహారిక నుంచుని ఉంది. అన్నయ్యను ఆటపట్టిస్తూ నవ్వుతున్న ఫొటోను కూడా పంచుకుంది. కాకపోతే నీహారిక భర్తతో కలసి ఉన్న ఫొటోను పంచుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement