Tuesday, April 30, 2024

విరూపాక్ష.. నాలుగు రోజుల్లో రూ.50కోట్లు

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం విరూపాక్ష‌.ఈ చిత్రాన్ని కార్తీక్‌ దండు తెర‌కెక్కించాడు. కాగా ఈ మూవీ ఏప్రిల్‌ 21న సైలెంట్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన విరూపాక్ష ఫస్ట్‌ షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.కాగా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, సబ్జెక్టు కూడా ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సినిమాలోని ట్విస్టులు, హర్రర్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఈక్రమంలోనే సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ అందుకుంది విరూపాక్ష. మొత్తానికి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల మార్క్ ని అందుకుంది. తద్వారా నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెట్‌ టార్గెట్‌ను పూర్తిచేసింది. ఇక మంగళవారం సాయంత్రం నుంచి వచ్చే వసూళ్లన్నీ కూడా ‘విరూపాక్ష’కి లాభాల కిందే లెక్క. విరూపాక్ష సినిమా రూ.50కోట్ల క్లబ్‌లోకి చేరవడంపై దర్శకనిర్మాతలు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. విరూపాక్ష సినిమాకు సుకుమార్‌ అందించిన గ్రిప్పింగ్‌ స్ర్కీన ప్లే హైలెట్‌గా నిలిచింది. అలాగే కాంతారా ఫేమ్‌ అజనీశ్‌ లోక్‌నాథ్‌ అందించిన బీజీఎమ్‌, స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement