Wednesday, May 1, 2024

విరాట పర్వం…ఓటిటిలోనే ?

కెరీర్ ఆరంభం నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు హీరో దగ్గుబాటి రానా. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది.అలాగే ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు రానా విరాటపర్వం సినిమా కూడా ఓటీటీ లోని రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను కొనుగోలు చేసిందట. అయితే మరో వైపు వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు మాత్రం ఓటీటీ కే ఫిక్స్ అయ్యాయి. కానీ విరాటపర్వం మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని కూడా టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement