Sunday, May 19, 2024

సినీ ఇండ‌స్ట్రీలో విజ‌య్ ద‌ళ‌ప‌తి త‌న‌యుడు.. డైరెక్ట‌ర్ గా ఎంట్రీ

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తొలిసారిగా మెగాఫోన్ పడుతూ దర్శకుడిగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఆ మూవీని నిర్మించనున్నారు. కాగా ఈ క్రేజీ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల వచ్చింది.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ ”సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుంది. మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిట్ పాయింట్ నచ్చింది. అలాగే సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (హానర్స్)ను పూర్తి చేశారు. టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్ సంజయ్ విజయ్ తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement