Thursday, May 2, 2024

గ్రూప్‌-4 ప్రైమరీ కీ, ఓఎంఆర్‌ షీట్లు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-4 పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్లను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. అలాగే ప్రైమరీ కీ కూడా విడుదల చేసింది. కీ పైన అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈనెల 30వ తేదీ నుండి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు అన్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు తెలిపారు.

జులై 1న తెలంగాణలో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు పరీక్షను నిర్వహించగా 7.61 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-4 పేపర్‌1కు 7,62,872 మంది హాజరుకాగా, పేపర్‌కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement