Thursday, May 16, 2024

లోకల్ నాన్ లోకల్ వివాదంలోకి వర్మ

మా అసోసియేషన్ ఎన్నికల బరిలో ఈ సారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… లోకల్ నాన్ లోకల్ అనే మాట ని బయటికి తీసుకు వస్తున్నారని మాట్లాడారు. అయితే ఇదే విషయంపై వివాదాస్పద దర్శకుడు వర్మ స్పందించారు. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మద్రాసు వెళ్లారు. వాళ్లు లోకలా ?

30 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ తెలుగు నేర్చుకుని స్థిరపడ్డ ప్రకాష్ రాజ్ తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకో లేదా ఆయన ప్రతిభకి ఈ దేశం నాలుగు సార్లు జాతీయ అవార్డులతో సత్కరించింది. అలాంటి వ్యక్తి ని నాన్ లోకల్ అంటారా అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అంతేకాకుండా మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ కూడా నాన్ లోకల్, మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, రాముడు ,సీత కూడా నాన్ లోకల్ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement