Sunday, May 5, 2024

నితిన్ తో మళ్ళీ వెంకీ కుడుముల ?

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత 2020లో యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో రష్మిక మందన హీరోయిన్ గా భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ స్టార్ట్ అవడంతో తన తర్వాతి సినిమాను ప్రకటించలేదు.

ఇక ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వెంకీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగ చైతన్య తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడిచింది. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం వెంకీ కుడుముల నితిన్ తో మరో సినిమా చేయబోతున్నాడట. గతంలో కూడా నితిన్ వెంకీ తో మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. అలాగే భీష్మ హిట్ తర్వాత ఓ మంచి లగ్జరీ కారును కూడా వెంకీకి బహుమతిగా ఇచ్చాడు నితిన్. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement