Tuesday, April 30, 2024

తాలిబన్ల పై వర్మ వరుస ట్వీట్స్…వాళ్ళు పిల్లలంట!!

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ఆ దేశం నుండి పారిపోయేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయమై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస గా ట్వీట్స్ చేస్తున్నారు. కాబూల్ లోని ఓ పార్క్ కి వెళ్లిన తాలిబన్లు ఎలక్ట్రిక్ బంపర్ కార్లో కూర్చొని చిన్నపిల్లల్లా రైడింగ్ చేస్తూ ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నా వీడియోను పోస్ట్ చేస్తూ… ఇది నిజం తాలిబన్స్ జస్ట్ కిడ్స్ అంటూ కామెంట్ చేశాడు.

మరో వీడియో లో… చేతులలో ఆయుధాలు పట్టుకుని అధ్యక్ష భవనంలో జల్సాలు చేస్తున్న తాలిబన్ల వీడియో ని పోస్ట్ చేస్తూ.. వాళ్ళు ఎలాంటి జంతువులు అనేది ఇది చూస్తేనే అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement