Saturday, April 27, 2024

ఏడేళ్ల తరువాత…ఆ స్టార్ తో త్రిష – అఫీషియల్

యూటర్న్ సినిమా దర్శకుడు పవన్ కుమార్ ప్రస్తుతం ద్విత్వ సినిమా చేస్తున్నాడు. కేజిఎఫ్, సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిష నటించబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

విశేషం ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ తో త్రిష ఏళ్ల క్రితం పవర్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత కన్నడలో ఏ సినిమాలోనూ నటించలేదు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు త్రిష రెండో సినిమా చేస్తోంది. ఇక పవన్ కుమార్ ఇటీవలే కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం అది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement