Friday, May 3, 2024

ఢిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధుకు ఘనస్వాగతం..

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు భారత్ చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో పీవీ సింధుకు ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు పీవీ సింధుకు ఘనంగా స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీలలో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇంతవరకూ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు. జియావోతో మొదటి గేమ్‌లో సింధు 21-13 స్కోర్‌తో గెలిచారు. రెండో గేమ్‌లోనూ మొదటి నుంచీ ఆధిక్యాన్ని చూపించిన సింధు 21-15తో రెండో గేమ్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. కాంస్య పతకం గెలిచిన సింధును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పీవీ సింధు భారతదేశానికే గర్వకారణమైన క్రీడాకారిణి అని శుభాకాంక్షాలు తెలిపారు.

 కాగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను పీవీ సింధు కలవనుంది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్‌ బృందం ఆగస్టు 15 వేడుకలకు హాజరుకానుంది. వేడుకల్లో పాల్గొననున్న బృంద సభ్యులను ప్రధాని మోదీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి: Twitter: ఇకపై లాగిన్ మరింత సులభతరం..

Advertisement

తాజా వార్తలు

Advertisement