Friday, May 3, 2024

ఇండస్ట్రీ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. తాజాగా నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందారు. రాఘవ ప్రసాద్ వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవ ప్రసాద్ ఆఖరికి కన్నుమూశారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించిన ఆయన స్వయంగా ఆ సినిమాను నిర్మించారు.

ఆ తరువాత రూపాయి సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు రాఘవ ప్రసాద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement