Thursday, April 18, 2024

రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించండి: టాప్ బ్రాండ్ కంపెనీలకు సింధు నోటీసులు!

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన స్టార్ షెట్లర్ పీవీ సింధు చిత్రాలను అనధికారికంగా ఉపయోగించినందుకు పలు బ్రాండ్ కంపెనీలకు ఆమె నోటిసులు పంపనుంది. టోక్యో ఒలింపిక్స్ 2021లో సింధు కాంస్య పతకం గెలిచిన సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఆదిత్య బిర్లా గ్రూప్, హ్యాపీడెంట్, విక్స్, పాన్ బహార్, అపోలో హాస్పిటల్స్‌తో సహా పెర్ఫెట్టి వాన్ మెల్లె, పి అండ్ జి, లాంటి కంపెనీలు తమ బ్రాండ్ ను ప్రమోషన్ చేసుకున్నాయి. సింధు అనుమతి లేకుండా ఆమె చిత్రాలను ఆయా కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై సింధు చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. సింధుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను నిర్వహించే స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఆమె తరపున లీగల్ నోటీసులను పంపనుంది. వీటిలో ప్రతి కంపెనీ నుండి రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతోంది.

ఇది కూడా చదవండి: హాకీ కథ వెనుక ఉన్నది ఎవరు..?

Advertisement

తాజా వార్తలు

Advertisement