Monday, May 20, 2024

Hanuman నైజాం థియేట్రిక‌ల్ రైట్స్ వారికే !

యువ నటుడు తేజ సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ హను మాన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక‌, ఇప్పటికే సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచిన హను మాన్ నైజాం థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి వారు దక్కించుకున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన తమ మూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడం ఖాయం అని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement