Wednesday, May 8, 2024

AP | జూ.లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామకానికి ఏపీపీఎస్సీ అధికారులు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలోని ఆయా జూనియర్‌ కళాశాలల్లో ఉన్న 47 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికచేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలను https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు జనవరి 31 నుంచి పిభ్రవరి 20 వ తేదీ అర్థరాత్రి లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement