ప్రభాస్, పూజహెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం నుండి ఈ రాతలే… లిరికల్ వీడియో పాట విడుదలైంది. అభిమానులను అలరిస్తున్న ఈ పాటకు మంచి స్పందన వచ్చిందని చిత్ర బృందం అంటోంది. పాట చిత్రీకరణ అద్భుతమైన లొకేషన్స్లో జరిగింది. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అందులోఐదు విషయాలు. మనం పంచభూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమి, గాలి వీటిని పాటలో చూపించారు..
దీని ఉద్దేశం ఏమంటే ప్రేమించే వాళ్ళకోసం ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరేవాటిని అధిగమించి చేరుకోవాలని చెప్పడం. పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడినట్టు కనిపిస్తోంది. పాట గురించి పూర్తిగా అర్థంకావాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. గోపీకృష్ణ మూవీస్ ప్రైయి వేటు లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుంది.