Saturday, May 4, 2024

ప‌శ్చిమ బెంగాల్ లో ది కేర‌ళ స్టోరీ మూవీ నిషేధం..

వివాద‌స్ప‌ద మూవీ ది కేర‌ళ స్టోరీని ప‌శ్చిమ బెంగాల్ లో నిషేధించారు.. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్వ‌యంగా ఒక ప్ర‌క‌ట‌న చేశారు..ది కేరళ స్టోరీ సినిమా వక్రీకరించిన కథ అని పేర్కొన్నారు. ఈ సినిమా వివాదాలు రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకునే నిషేధం విధించామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. వివిధ పార్టీలు, ముస్లిం సంఘాలు ఈ సినిమాలను వ్యతిరేకిస్తున్నాయి. దాంతో అనేకచోట్ల ఈ సినిమా ప్రదర్శనలను థియేటర్ యాజమాన్యాలే నిలిపివేస్తున్నాయి. కేర‌ళ‌, త‌మిళ‌నాడుల‌లోని మ‌ల్టీ ఫ్లెక్స్ ల‌లోఈ మూవీ ప్ర‌ద‌ర్శ‌న‌ను స్వ‌చ్చందంగా నిలిపివేశారు..ఇక ఈ మూవీకి మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement