Tuesday, April 30, 2024

తాగుడుకు బానిసై, ఇంట్లో గొడ‌వ‌లు.. మ‌న‌స్తాపంతో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

వాజేడు, (ప్రభ న్యూస్): తాగుడుకు బానిస‌గా మారి, భార్యా పిల్ల‌ల‌ను త‌రుచూ కొడుతూ గొడ‌వ‌ప‌డే వ్య‌క్తి మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ఇవ్వాల (సోమ‌వారం) త‌న కుటుంబ స‌భ్యుల‌తో జ‌రిగిన గొడ‌వ‌తో ఉరేసుకునికి ఆత్మ‌హత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడు మండ‌లంలో జ‌రిగింది. పేరురు ఎస్సై హ‌రీశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన‌ పెళ్లకూరి సత్యనారాయణ (27), తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస‌గా మారాడు.

నెల రోజులుగా భార్య పిల్లలను కొడుతూ తరచూ గొడవపడేవాడు. సోమవారం ఉదయం తాగిన మైకంలో భార్యతోపాటు అతని అన్నతమ్ముళ్లతో గొడవ జ‌రిగింది. దీంతో మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినాడు. ఈ విష‌యం మృతుని తమ్ముడు పెళ్లకూరి సాయి కుమార్ ఫిర్యాడు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement