Wednesday, May 1, 2024

హిందూపురం సిఐపై హైకోర్టు సీరియ‌స్

అమరావతి: హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసు విషయానికి సంబంధించి అడ్వకేట్‌ కమిషనర్‌గా వెళ్లిన న్యాయవాది, కోర్టు సిబ్బందిపై సీఐ దురుసు ప్రవర్తను హైకోర్టు ధర్మాసనం సుమోటో పిల్‌గా కుంది.. దీనిపై కోర్టు విచార‌ణ జ‌రిపింది.. జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయటానికి సీఐకి ఎంత ధైర్యం? అని న్యాయస్థానం మండిపడింది. సీఐ ప్రవర్తన కోర్టు విధులకు ఆటంకపరచడమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. దీంతో సిఐ పై చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement