Friday, May 3, 2024

Breaking: ఈతకెళ్లి ముగ్గురు బాలికలు మృతి

ఈతకెళ్లి ముగ్గురు బాలికలు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాకొండ చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లి ముగ్గురు బాలికలు మృతిచెందారు. మృతులు రాధిక (16), శ్రావణి (14), మహి (14) లుగా గుర్తించారు. చనిపోయిన బాలికలు మరికల్ మండలం రాకొండకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఇవాళ ఒక్కరోజే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. శ్రీరంగాపురం మండలం తాతిపాములలో వీరసముద్రం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి తిరుపతమ్మ (16), సంధ్య (12), దీపిక (10)లు పడి మరణించారు. దీంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఆరుగురు చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement