Wednesday, May 8, 2024

పోలీస్ ఆఫీసర్ గా కార్తికేయ రేపే రాబోతున్నాడు

ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు హీరో కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అయితే ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ని ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఆలోచనతో విభిన్నమైన కథను ఎంచుకున్నాడు.

శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకు ఇంత వరకు టైటిల్ ఖరారు చేయలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement