Thursday, May 16, 2024

నా టీకా అయిపోయింది…సూపర్ స్టార్ మహేష్ బాబు

దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేలల్లో మృతి చెందుతున్నారు. కాగా ఈ వైరస్ కు ఏడాది ప్రారంభం నుంచి వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు.

నా టీకా పూర్తయింది. మీరు కూడా తీసుకోండి. కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరిని తీవ్రంగా దెబ్బతీసింది. టీకా తీసుకోవడం ఒక గంట పని మాత్రమే. పద్దెనిమిదేళ్లు మరియు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు మే 1న వ్యాక్సిన్ తీసుకోండి అంటూ… మహేష్ ట్వీట్ చేశాడు. కాగా మే 1 నుండి 18 ఏళ్ల వయసు పై బడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement