Monday, April 29, 2024

కరోనా టెస్ట్ పై లెక్కలేదు… శృతిహాసన్

లాక్‌డౌన్‌ అనంతరం… షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన తర్వాత షూటింగ్ స్పాట్ కి వెళ్లేముందు ప్రతి ఒక్కరూ కరోన టెస్ట్ చేసుకోవాలి అనే నిబంధనను పెట్టిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కరోనా టెస్ట్ లపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కరోనాను నిర్లక్ష్యం చేయడం లేదని… ముఖ్యంగా తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని రెగ్యులర్ గా టెస్ట్ కు చేయించుకుంటూ ఉంటానని తెలిపింది.

తాను ఎక్కువగా షూటింగ్ నిమిత్తం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అందువల్ల ఇబ్బంది తప్పనిసరి.అందుకే ఈ విషయంలో చాలాసార్లు టెస్టులు చేయించుకుంటున్నారని తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement