Monday, April 15, 2024

హైద‌రాబాద్ న‌లుదిక్కుల అభివృద్ధి….

హైదరాబాద్‌, : హైదరాబాద్‌ నగర ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చేందుకు అన్ని దిక్కుల్లో అభివృద్ధి జరగాలని, నగరం నలువైపులా అద్భుతమైన మార్పులు రావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌కు అనుసంధానంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్‌ అవస రాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన ఒక నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కా రం, భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం.. అనే అంశం మీద సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బేతి సుభాష్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ, కె.పి. వివేకానంద, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజ క వర్గాలు, మునిసిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీ కృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్‌ హాల్స్‌ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్‌ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సిీఎం అన్నారు. ఈ దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఆ రెండు జిల్లాల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిరంతర పర్యవేక్షణ
హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ నగరంగా పురోగమిస్తున్నది. నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు దిన దినాభివృద్ధి చెందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలను, కార్పొ రేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. #హదరాబాద్‌ నగరంతో పాటు సమ్మిళితా భివృద్ధిని కొనసాగించే విధంగా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి. ఇందుకు నిరంతరం పర్య వేక్షించేందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు హైదరాబాద్‌ నగరంలో మాదిరి విద్య, వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెవాలి. అందుకు ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలు న్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి. మౌలికవసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వాటి పరిష్కారానికి నోడల్‌ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశమవుతుండాలి. ఇందులో ఏఏ శాఖలు భాగస్వా మ్యం కావాల్సి వున్నవి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర అంశాన్నింటిని ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి చర్చిం చాలి. నెలకోసారి ప్రజాప్రతినిధులు సీఎస్‌తో క్రమం తప్పకు ండా సమావేశం కావాలి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నోడల్‌ అధికారి సమీక్షించాలి. అందుకు సంబంధించిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.
ఈ మునిసిపాలిటీలకు పెద్దపీఠ
షాద్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయాంజల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకర్‌పల్లి, తుక్కుగూడ, ఆమన్‌గల్‌ వంటి మునిసిపాలిటీలు, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట్‌, జిల్లెలగూడ వంటి మునిసిపల్‌ కార్పొరేషన్లు మేడ్చల్‌ జిల్లా పరిధిలోని బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాం పేట వంటి మునిసిపల్‌ కార్పొరేషన్లు.., మేడ్చల్‌, దమ్మాయి గూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్‌ వంటి మునిసిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రాంతాలన్నీ హైదరాబాద్‌ నగరంలో దాదాపు కలిసిపోయాయని, వివిధ ప్రాంతాల నుంచి జీవనో పాధి వెతుక్కుంటూ, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన తెలంగాణ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర పడుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని సీఎం అన్నారు.
నిధులు సమీకరిస్తాం
అభివృద్ధికి సంబంధించి నిధులు సమీకరించడంతో పాటు నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసి నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కీలకం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. త్వరలో ఈ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతి నిధులు సహా విద్య, వైద్యం, విద్యుత్తు శాఖ, మునిసిపల్‌ శాఖ, మిషన్‌ భగీరథ, తదితర మౌలిక వసతుల కల్పనలో భాగస్వా మ్యం అయ్యే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని సిీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement