Monday, April 29, 2024

నువ్వు ప్యాంటు వేసుకుంటే ఏంటి ? వేసుకోకపోతే ఏంటి ? శ్రీరెడ్డి పై పవన్ ఫ్యాన్స్ ఫైర్

శ్రీరెడ్డి… ఈ పేరు చెప్పగానే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి పవన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతూ… నా పేరు శ్రీ రెడ్డి. నాకు ఓ డ్రామా కంపెనీ ఉంది. ఆ డ్రామా కంపెనీ లో బండి ఎద్దుల గణేష్, పవన్ ఇద్దరూ పని చేస్తారు. అందులో బండ ఎద్దుల గణేష్ కు మొదట కరోనా జ్వరం వచ్చింది. ఆ తరువాత వాడు పవన్ కి అంటించాడు.

ఇప్పుడు ఆ ఇద్దరు కనిపించకుండా పోయారు. ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి మా డ్రామా కంపెనీ అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఆ ఇద్దరు కనిపించట్లేదని తొందరలో ప్యాంటు కూడా వేసుకోవడం మర్చిపోయాను అంటూ పవన్ కళ్యాణ్ ను అలాగే బండ్ల గణేష్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేసింది.

అలాగే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నాడు ఎవరు కూడా ఓటు వేయకండి అంటూ శ్రీరెడ్డి ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. అయితే కరోనాతో బాధపడుతున్న పవన్ పై ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల ఫ్యాన్స్ మండి పడుతున్నారు. నువ్వసలు ఆడదానివేనా అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. మరికొంతమంది నువ్వు ప్యాంట్ వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఓ వైపు పవన్ కరోనా తో బాధపడుతుంటే ఈ సమయంలో శ్రీ రెడ్డి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

https://www.facebook.com/watch/?v=284499863160888

Advertisement

తాజా వార్తలు

Advertisement