Monday, April 29, 2024

సిద్దార్థ్ ట్వీట్…. ఇప్పుడు హాట్ టాపిక్

హీరో సిద్దార్థ్ సోషల్ మీడియా చేసిన ట్వీట్ ఇప్పుడు సెగలు రేపుతోంది. కరోనా కారణంగా భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంటే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని సిద్దార్థ్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ… సెలబ్రిటీలు సైతం మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు ఇంతలా కళ్ళు ముందే జరుగుతున్న మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు. కానీ ప్రజలు ఈ విషయమై మాట్లాడాలని, ప్రభుత్వాలని ప్రశ్నించాలని కోరాడు. ప్రజారోగ్యం విషయమై ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని అన్నాడు. అప్పుడే ఈ పరిస్థితుల నుండి బయటపడగలమని, ప్రజలు కళ్ళు తెరవాలని ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement