Sunday, April 28, 2024

ప్రభాస్ ప్రశాంత్ నీల్ పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది శృతిహసన్. ప్రస్తుతం శృతి హాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హల్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్, హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు నేను సలార్ సినిమాకు సంబంధించి చిన్న షెడ్యూల్ మాత్రమే చేశాను. కానీ డార్లింగ్ ప్రభాస్ హంబుల్ పర్సన్. అలాగే ఎల్లప్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటారు. ఇక డైరెక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్.

అనాధ పిల్లలకు ఆర్ధిక సహాయం చేసిన సంపూర్ణేష్ బాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement