Thursday, April 25, 2024

అనాధ పిల్లలకు ఆర్ధిక సహాయం చేసిన సంపూర్ణేష్ బాబు

నటుడు సంపూర్ణేష్ బాబు మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్టకాలంలో తనకు వీలైనంత వరకూ ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేశారు సంపూర్ణేష్ బాబు. అలాగే మొన్నటికి మొన్న ప్రముఖ జర్నలిస్ట్ టి ఎన్ ఆర్ మృతి చెందిన తర్వాత వారి కుటుంబానికి కూడా తన వంతు ఆర్థిక సహాయం చేశాడు. అలాగే వరద బాధితులకు కూడా సహాయం చేశాడు. తాజాగా మరో ఇద్దరు అనాధ పిల్లలకు సంపూర్ణేష్ బాబు తన వంతు ఆర్థిక సహాయం చేశారు. దుబ్బాకలో అప్పుల భారంతో నరసింహాచారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో వారిద్దరు కూతుళ్లు అనాధలుగా మిగిలారు. అయితే విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం వారికి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఇలా ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని రోడ్డునపడే టట్టు చేయకూడదు అంటూ చెప్పుకొచ్చారు సంపూర్ణేష్ బాబు.

70శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన బింబిసార!!

Advertisement

తాజా వార్తలు

Advertisement