Friday, April 26, 2024

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ అధ్యక్షుడు

వైఎస్ఆర్సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషకరమైన విషయమని బండి సంజయ్ అన్నారు.  టీఆర్ఎస్ పాలనపై విసుగు చెందిన ఎందరో నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని బండి పిలుపునిచ్చారు.

కాగా, ఇటీవల వరకు తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి ఏప్రిల్ 3న వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో తాను జాతీయ పార్టీలో చేరి.. 2023 ఎన్నికలలో హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement