Thursday, May 9, 2024

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తో శర్వానంద్ కొత్త సినిమా ?

ఇటీవల శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం మహాసముద్రం సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు తాజాగా ఓ షార్ట్ ఫిలిం మేకర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ మనసా నమః తో దీపక్ రెడ్డి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే కొంత మంది యంగ్ హీరోలు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యు.వి.క్రియేషన్స్ కు దీపక్ రెడ్డి ఓ కథ చెప్పాడట.వారికి నచ్చటంతో శర్వానంద్ ను హీరోగా ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్ సైతం కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement