Saturday, May 4, 2024

డబ్బింగ్ స్టార్ట్ చేసిన సాయిధరమ్ తేజ్ !!

సుప్రీం హీరో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల్లో చుట్టూ తిరుగుతుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. మరోవైపు జగపతిబాబు ,రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అన్ని సినిమా షూటింగ్ కు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు మిగిలిఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేస్తున్నాయి.

కాగా తాజాగా సాయి ధరమ్ తేజ్… రిపబ్లిక్ కోసం డబ్బింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక కరోనా కారణంగా ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ అవుతుందని గతకొన్ని రోజులు గా వార్తలు వచ్చాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement