Thursday, April 25, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్: నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దు

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హాంప్‌షైర్ బౌల్ మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. దీంతో ఈ రోజు మ్యాచ్ కుదరని పరిస్థితుల్లో ఆటను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో రిజర్వ్ డేతో కలిపి మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. పరిస్థితి ఇలాగే ఉన్నా.. మ్యాచ్ డ్రా అయినా.. భారత్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement