Saturday, April 27, 2024

సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ఓటీటీ పార్ట్నర్ కన్ఫామ్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనే ప్రసారం కానుందని మేకర్స్ కూడా థియేటర్లో వెల్లడించారు. అయితే, ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమా.. ప్రస్తుతం థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement