Wednesday, April 24, 2024

47 ప‌రుగులు చేసి జైశ్వాల్ ఔట్ – ఆర్ ఆర్ 121/3

బెంగళూర్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 47 ప‌రుగులు చేసిన జైశ్వాల్ వికెట్ ను కోల్పోయింది.. ఈ వికెట్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ కు ల‌భించింది..అంత‌కు ముందు ప‌డిక్క‌ల్ రూపంలో రెండో వికెట్ ను కోల్పోయింది.. ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసిన ప‌డిక్క‌ల్ 52 ప‌రుగుల‌కు విల్లీస్ బౌలింగ్ లో అవుట‌య్యాడు..ముందుగా విధ్వంస‌క ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(0)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతిని డిఫెండ్ చేయ‌బోయిన బ‌ట్ల‌ర్ అంచ‌నా త‌ప్పింది. బంతి వికెట్ల‌ను తాకింది. దాంతో, 1 ప‌రుగు వద్ద ఆ జ‌ట్టు తొలి వికెట్ ప‌డింది. అనంత‌రం జైశ్వాల్, ప‌డిక్క‌ల్ వికెట్ ల‌ ను పొగొట్టుకుంది.. హెట్మ‌యిర్ 1 , సంజూ శాంస‌న్ 17 పరుగుల తో క్రీజులో ఉన్నాడు 15 ఓవర్ లలో ఆర్ ఆర్ 3 వికెట్ ల నష్టానికి 121 పరుగుల చేసింది

అంతకు ముందు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శ‌త‌కం బాదారు. దాంతో, నిర్ధారిత 20 ఓవర్ లలో ఆర్సీబీ9 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డ‌కౌటయ్యాడు. ఆ త‌ర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవ‌ర్ల‌కు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత జోరు పెంచిన వీళ్లిద్ద‌రు వెంట వెంట‌నే ఔటయ్యారు. ఆ త‌ర్వాత‌ ఆర్సీబీ ప‌రుగుల వేగం త‌గ్గింది. చివ‌ర్లో దినేశ్ కార్తిక్(16), మ‌హిపాల్ లొమ్‌రోర్(8), వ‌నిందు హ‌స‌రంగ‌(6) ధాటిగా ఆడడంతో 180 ప్ల‌స్ చేయ‌గ‌లిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement