Wednesday, May 15, 2024

నిహారిక వెబ్ సిరీస్ కి.. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌పోర్ట్

పెళ్లి త‌ర్వాత కూడా సినిమా రంగంలో బిజీగా ఉంది కొణిదెల వారి అమ్మాయి..న‌టి.. నిర్మాత నిహారిక‌..కాగా తాజాగా క్రేజీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’ . అలెక్సా డేవిస్, విల్ మెరిక్, సార్గోన్ యెల్డా నటించిన హాలీవుడ్ హిట్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’ 2019లో విడుదలైంది. ఈ సిరీస్ నే తెలుగులో రీమేక్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మే16న హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో Dead Pixels ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హాజరు కాబోతున్నారు. నటిగా వెబ్ సిరీస్ తో మళ్లీ అలరిచబోతున్న నిహారికకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నారు. అక్షయ్ పూల్లా స్క్రీన్‌ప్లే అందించగా.. డైరెక్టర్ ఆదిత్య మండల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్ ద్వారా BBC స్టూడియోస్ ఇండియా, Tamada మీడియా సంయుక్తంగా నిర్మించాయి. డెడ్ ఫిక్స్ తెలుగు సిరీస్ లో నిహారిక కొణిదెల, హర్ష చెముడు, సాయి రోనక్, అక్షయ్ లగుసాని, భావన సాగి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 19న స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement