Monday, May 6, 2024

రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌.. క‌స్ట‌డీ

హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తెలుగుతో పాటు తొలిసారి నేరుగా తమిళ్ లో ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వం, అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించడంతో ఇరు రాష్ట్రాల్లోనూ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. దాంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే.. పెట్టుబడి మొత్తం రాబట్టినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు, ఇతర ప్రాంతాల్లో మరో మూడు కోట్లు సహా ఈ సినిమా దాదాపు 23 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. మరో కోటి రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఓటీటీ, ఇతర హక్కులను లెక్కలోకి తీసుకుంటే ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిందని అంటున్నారు. చైతన్యకు హిట్ పడ్డా పడకపోయినా ‘కస్టడీ’ నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement