Monday, April 29, 2024

ద‌ళిత బాంధవుడు కెసిఆర్ …ఖండాంతరాలు దాటిన ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దళిత జనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును బ్రిటన్‌ సమాజం సైతం పొగుడు తోంది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం కేసీఆర్‌ దార్శనికతను కొనియా డుతూ యూకే పార్లమెంట్‌ హాల్‌లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు కార్యాచరణ దేశంలో ఇప్పటికే విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళిత బహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సీఎం కేసీఆర్‌ కార్యాచరణకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటు-న్న నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇదివరక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి కార్యాచరణను లేఖ ద్వారా ప్రశంసించిన బ్రిటన్‌ ఎంపీలు తాజాగా లండన్‌ ఇతర ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, కొంతమంది బ్రిటన్‌ పౌరులు ఎన్నారైలతో కలిసి కృతజ్జతలు తెలుపుతూ సభను నిర్వహిండం చర్చనీయాంశంగా మారింది…

అంబేద్కర్‌ యూకే సంస్థ’ మరియు ‘ప్రవాస భారతీయ సంస్థ’ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కేసీఆర్‌ కృతజ్జత సభ ఘనంగా జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్‌ పేరు పెట్టడం, సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ సభ జరిగింది. యూకే పార్లమెంట్‌ కమిటీ- హాల్‌లో ఏర్పాటు- చేసిన కేసీఆర్‌ కృతజ్ఞత సభకుకు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ, నవేదు మిశ్ర, బారోన్‌ కుల్దీప్‌ సింగ్‌ సహోటతో పాటు పలువురు స్థానిక కౌన్సిలర్లు హాజరయ్యారు. బ్రిటన్‌ లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు-, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్‌డిసీ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, తదితరులు ఈ కృతజ్జత సభకు హాజరై సీఎం కేసీఆర్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బ్రిటన్‌ ఎంపీలు మాట్లాడుతూ, అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్‌ గారని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిద”ని వారు తెలిపారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారి నాయకత్వంలో అంబేద్కర్‌ గారి విగ్రహ ఏర్పాటు- మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిమంతంగా ఉందని బ్రిటన్‌ ఎంపీలు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితులు ఆర్థికంగా బలపడడమే కాకుండా సమాజం లో వారికి ఆత్మగౌరవం సముచితంగా పెరుగుతుందని సామాజిక వివక్ష, అసమానతలు తొలిగిపోతాయని బ్రిటన్‌ ఎంపీలు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్నతెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని వారు అభినందించారు.


సామాజిక ఆర్థిక వివక్షను రూపుమాపేదిశగా ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని బ్రిటన్‌ ప్రజా ప్రతినిధులు ప్రసంశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు- దళిత్‌ యూకే నెట్వర్క్‌ డైరెక్టర్‌ గజాల షేఖ్‌, అంబేద్కర్‌ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, ఎన్నారై బీ.ఆర్‌.యస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ కడుదుల, టీ-డీఎఫ్‌ చైర్మన్‌ కమల్‌ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్‌ ఖాజా, ఉదయ్‌ ఆరేటి, కన్సర్వేటివ్‌ నాయకుడు హరి, శ్రీమతి లోకమాన్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement