Friday, April 26, 2024

రంగ‌మార్తాండ‌లో ర‌మ్య‌కృష్ణ చేస్తానంటే భ‌య‌ప‌డ్డా.. కృష్ణ‌వంశీ

రంగ‌మార్తాండ‌ సినిమాలో న‌టుడు ప్రకాశ్ రాజ్ భార్య పాత్ర కోసం .. సీనియ‌ర్ న‌టులు రేవతి .. రాధిక .. సుహాసిని .. శోభన .. టబూ వీళ్లంతా కూడా కళ్లముందు మెదిలారని చెప్పారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. వాళ్లని సంప్రాదించే పనుల్లో నేను ఉండటం చూసిన రమ్యకృష్ణ నేను చేయనా అని అడిగింది. ఈ పాత్రకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు .. కళ్లతోనే మాట్లాడవలసి ఉంటుంది.. ఆలోచించుకో అని చెప్పాను.మరేం ఫరవాలేదు .. నేను చేస్తాను’ అంది. దాంతో నేను భయపడిపోయాను. ఎందుకంటే పెళ్లికి ముందు రమ్యతో చంద్రలేఖ చేశాను. ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంతవరకూ సినిమా చేయలేదు. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్ వేరు. తను మంచి నటి అనే విషయం ఇంతకుముందు తెలుసు .. ఈ సినిమాతో తాను గొప్ప నటి అనే సంగతి అర్థమైందన్నారు కృష్ణ‌వంశీ. నిన్నే థియేటర్లలో రిలీజ్ అయింది ఈ చిత్రం. నిన్న చాలా చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్స్ పడ్డాయి. తొలి ఆటతోనే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తరువాత థియేటర్స్ లో కన్నీళ్లు పెట్టించిన సినిమా ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement