Thursday, April 18, 2024

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటేసిన వైఎస్ జగన్

ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన సభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ, వైస్సార్సీపీ నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement