Sunday, April 28, 2024

బాలయ్య కు నో చెప్పిన రకుల్ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కు ప్రాధాన్యం ఉందట. అందులో ఓ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను సంప్రదించారట. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బాలయ్యకు నో చెప్పిందట. అందుకు కారణం మాత్రం తెలియరావట్లేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రస్తుతం అవకాశాలు లేక బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఇక తెలుగులో ఆఖరిగా చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement