Sunday, April 28, 2024

రాధే శ్యామ్ డీల్స్ క్లోజ్ ?

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇండియా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కుల డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

హిందీ హక్కులు మినహా మిగతా భాషలకు సంబంధించిన హక్కులను జీ సంస్థ కొనుగోలు చేయగా హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారట. మొత్తం 250 కోట్ల రూపాయలకి రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయని సమాచారం. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో సినిమాల కంటే ఇది చాలా ఎక్కువ. ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement