Saturday, April 27, 2024

డైరెక్షన్​కు ప్రభుదేవా గుడ్​బై!

కొరియోగ్రాఫర్​, డైరెక్టర్ ప్రభుదేవా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన డైరెక్షన్​ పక్కనపెట్టి నటనపైనే పూర్తిగా దృష్టిసారించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా.. తెలగు, తమిళం, హిందీ బాషాల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే, ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన డైరెక్షన్ ను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు టాక్. ఇకపై కేవలం నటనపైనే దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

2005లో విడుదలైన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో దర్శకుడిగా మారారు ప్రభుదేవా.. ఆ తరువాత ప్రభాస్​తో ‘పౌర్ణమి’ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. తెలుగు బ్లాక్​ బస్టర్ చిత్రం’పోకిరి’ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టారు. అయితే, సల్మాన్ ఖాన్​తో ఆయన తీసిన ‘దబాంగ్ 3’ ప్లాప్ టాక్ తెచ్చుకోగా.. ఇటీవల రిలీజైన ‘రాధే’ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. దీంతో ఇకపై డైరెక్షన్ వైపు వెళ్లకూడదని ప్రభుదేవా నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement