Saturday, April 27, 2024

ప్ర‌భాస్ గొప్ప‌త‌నం.. స‌లార్ టీం స‌భ్యుల ఖాతాల్లోకి రూ. ప‌ది వేలు

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆది పురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది. కాగా స‌లార్ మూవీ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ట‌.దాంతో స‌లార్ మూవీ కోసం ప‌ని చేస్తున్న టీం స‌భ్యులంద‌రి ఖాతాలో రూ.10వేలు జ‌మ చేశాడ‌ట ప్ర‌భాస్. కాగా ఈ పాన్ ఇండియా సినిమా కోసం యూనిట్‌ సభ్యులంతా రేయింబవళ్లు శ్రమించారని, అందుకు ప్రతిఫలంగానే తన వంతుగా ప్రభాస్‌ సాయం చేశాడని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియా సర్కిళ్లలో తెగ వినిపిస్తోంది. ఈ విషయం తెలు సుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. మా డార్లింగ్ మనసు చాలా గొప్పది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్‌ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిచ్చే స్టార్ హీరో ప్ర‌భాస్ తన అవసరం ఉన్నప్పుడు తప్పక సాయ పడుతుంటారు. సినిమా సభ్యులకు ఇంటి భోజనం తెప్పించడం, బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తూ తన మంచి మనును చాటుకున్నారు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగిశాక చిత్రబృందంలోని వారందరికీ ఓ ప్రముఖ కంపెనీ వాచీలు కానుకగా ఇచ్చారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement