Thursday, May 2, 2024

మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడే కాదు గాయకుడు కూడా. ఇప్పటి వరకు పలు సినిమాల్లో 9 పాటలు పాడిన పవన్.. మరోసారి తన గాత్రంతో అలరించనున్నట్లు తెలుస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో పవన్ పాట పాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ అనే మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ పోషించిన పాత్రలను తెలుగులో పవన్, రానా చేయనున్నారు. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడ‌గా.. తెలుగులో ప‌వ‌న్‌, రానా క‌లిసి పాడ‌నున్నార‌ని ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. ఈ మూవీకి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చనున్నాడు.

కాగా తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడి అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement