Saturday, May 18, 2024

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం… ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్, : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయమని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అన్నారు.. త్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని 191 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్, కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికులు మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను కలిసి విన్నవించారు.. కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాలని వాసులు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువచ్చారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం అన్నారు. ఎన్టీఆర్ నగర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం, కమిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, మురుగేశ్, యాదిరెడ్డి, శ్రీహర్ష, వీరన్న మరియు కాలని వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement