Monday, April 29, 2024

ఫ‌స్ట్ డే రూ.38కోట్లు వ‌సూలు చేసిన.. పొన్నియిన్ సెల్వ‌న్2

ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్2 .ఈ చిత్రం మొదటి రోజున రూ. 38 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ. 25 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రూ. 3..4 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో 60 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 10 శాతం, మలయాళంలో 34 శాతం, తెలుగులో 35 శాతం, కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
కర్ణాటకలో మరో రూ. 4-5 కోట్లు వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. వారంతం అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, పీఎస్1 భారత్ లో దాదాపు రూ. 327 కోట్లు, విదేశాల్లో రూ.169 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు మణిరత్నం తెర‌కెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పార్ట్ 1 భారీ విజయం అందుకోవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement