Thursday, May 2, 2024

కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడిన పవన్ కల్యాణ్ కు
వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని…. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని… ఆరోగ్యపరంగా పవన్ కల్యాణ్ కి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియచేశారు.

తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం
తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్న పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌ చికిత్స తీసుకున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో చికిత్స అందించారు. ఫార్మ్ హౌస్ లోనే ఆక్సిజన్ పెట్టి పవన్ కు చికిత్స ను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement