Wednesday, April 24, 2024

జాతి రత్నాలు సీక్వెల్ స్క్రిప్ట్ పై నాగ్ అశ్విన్ ?

అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమా ఉండబోతుంది అంటూ దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు సీక్వెల్ తో పాటు మరో సినిమా కథను తయారు చేస్తున్నాడని సమాచారం. ఇక నిర్మాత అశ్వినీ కూడా ప్రభాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కరోనా కారణంగా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో జాతిరత్నాలు సీక్వెల్ లో నాగ్ అశ్విన్ కూడా ఇన్వాల్వ్ అవబోతున్నారట. మొదట జాతిరత్నాలు సినిమాలో నాగ్ అశ్విన్ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదట. కానీ ఇప్పుడు మాత్రం నాగ్ అశ్విన్ అనుదీప్ కు జత కాబోతున్నారని తెలుస్తోంది. మరి ఈసారి జాతిరత్నాలు ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement